చెన్నై: అడవిలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించేందుకు తమిళనాడు సీఎం పళనిస్వామి చేసిన విజ్ఞప్తి మేరకు భారత వైమానికి దళాన్ని రంగంలోకి దింపినట్లు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విద్యార్థులకు సహాయం అందించేందుకు సూలూరు నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్ను పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, అగ్నిమాపక దళాలు ఇప్పటికే అటవీప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్నాయి.