అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది. శాసనసభలో బలబలాలను బట్టి టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం దక్కుతుంది. అయితే టీడీపీ తమ సభ్యుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన సీఎం రమేశ్ను మళ్లీ రాజ్యసభకే పంపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్య పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను చంద్రబాబు ఈ రోజు సాయంత్రం వరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.