ఇప్పటికే బీసీసీఐ కాంట్రాక్టు పోయింది. ఐపీఎల్లో ఆడే దానిపై స్పష్టత లేదు. ఇది ప్రస్తుతం టీమిండియా పేసర్ మహమ్మద్ షమి పరిస్థితి. తనను చంపించడానికి ప్రయత్నించిన షమి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి ఓ పాకిస్థానీ అమ్మాయి నుంచి డబ్బు తీసుకున్నాడని ఆయన భార్య హసీన్ జహాన్ తెలిపింది. తాజాగా హసీన్.. త్వరలో ముంబయి వెళ్లి బీసీసీఐ ప్రతినిధులను కలుస్తానని, షమిపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
‘త్వరలో బీసీసీఐ ప్రతినిధులను కలిసి.. షమిపై ఫిర్యాదు చేస్తా. తగిన చర్యలు తీసుకోమని కోరతా. ఈ రోజు నేను ఈ సమస్యను బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే బీసీసీఐని కలవాలని అనుకుంటున్నా’ అని హసీన్ తెలిపింది.గత మూడు రోజుల నుంచి వరుసగా హసీన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని అవన్నీ తనపై బురద చల్లే ప్రయత్నంలో భాగమని షమి అంటున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు షమితో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం, గృహ హింసతో పాటు పలు సెక్షన్ల కింద జాధవ్పూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.