హైదరాబాద్ : కేంద్ర విద్యా సంస్థలకు తక్కువ నిధులు కేటాయించారన్నది దుష్ప్రచారం మాత్రమేనని పురందేశ్వరి అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆమె కేంద్రం చొరవతోనే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు కూడా కేంద్రం ప్రత్యేక హోదా కొనసాగించడం లేదని అన్నారు. ఆమె జైట్లీ ప్రకటనను తెలుగుదేశం నేతలు తప్పుగా అర్ధం చేసుకున్నారన్నారు. ప్రత్యేక హోదాతో ఏపీకి ఎలాంటి లాభం ఉండదని జైట్లీ అన్నారని ఆమె తెలిపారు.