దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రపతిని కోరింది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎంపీల బృందం. రాష్ట్రపతి భవన్ లో మైత్రేయన్ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసిన ఎంపీల బృందం.. మెమోరాండంను అందజేశారు. జయ మృతిపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. అమ్మ జ్వరంతో మాత్రమే బాధపడ్డారని ఆస్పత్రి వర్గాలు ముందుగా ప్రకటించాయని, చనిపోయిన తర్వాత అనారోగ్య కారణాలు చెప్పడంతో ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.