న్యూఢిల్లీ: స్టీల్పై దిగుమతి సుంకం వసూల్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పన్నుతో మనకు ఎటువంటి నష్టం లేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉక్కు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నదని, ట్రంప్ నిర్ణయం వల్ల మనకు అకస్మాత్తుగా వచ్చే నష్టం ఏమీ ఉండదని ఉక్కు శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల చైనా, యూరోప్, కెనడా దేశాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. మన దేశం కేవలం రెండు శాతం మాత్రమే ఉక్కును అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తోందని, సెక్షన్ 232 ప్రకారం పన్ను విధానాన్ని మినహాయించే వీలుందని భారత ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మ తెలిపారు. 1962లో కుదిరిన వాణిజ్య ఒప్పంద చట్టం ప్రకారం దిగుమతులపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయన్నారు.