విజయవాడ: విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రత్యేక హోదా కోసం జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు వైసీపీ పిలుపునివ్వడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు.