కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి మఠాధిపతులు మహాభిషేకం నిర్వహిస్తున్నారు. మహాభిషేకం అనంతరం కంచి పీఠాధిపతి జయేంద్ర స్వామి మహాసమాధి కానున్నారు. సుమారు 4 గంటలపాటు బృందావన ప్రవేశ అభిషేకం కొనసాగుతుంది. అనంతరం జయేంద్ర సరస్వతిని కంచి మఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధి చేయనున్నారు. కొంత కాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కాంచీపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. స్వామికి కన్నీటి వీడ్కోలు వీఐపీలు, భక్తులు పలికారు. ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి నిర్వహిస్తున్న మహాసభిషేకం కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎ.కె.సింఘాల్, డాలర్ శేషాద్రి, టీటీడీ మాజీ ఛైర్మన్ బాపిరాజు పాల్గొన్నారు.