అమరావతి: అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద టీఎన్ఎస్ఎఫ్ సంబరాలు జరుపుకుంటోంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ సంబరాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా సీఎం నివాసం వద్ద టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సంబరాలకు సీఎం హాజరై అక్కడ ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు.