మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓట్లరు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఉదయం 10 గంటల వరకు మేఘాలయలో 22 శాతం, నాగాలాండ్లో 17 శాతం పోలింగ్ నమోదైంది. ఇరు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.