చెన్నై : తమిళనాడులోని సెయింట్ జోసెఫ్ కరుణై ఇళ్ళం వృద్ధాశ్రమంలో ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది వృద్ధులు చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ వృద్ధుల మృతదేహాలను కుళ్ళ బెట్టి ఎముకలను విదేశాలకు అమ్ముకుంటున్నారని సమాచారం. కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం అధికారి ఐజి పద్మనాభం ఆధ్వర్యంలో పది మంది సభ్యులు వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు. ఆశ్రమం వెనుక ఓ తొట్టెలో ఎముకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.