టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ రావన్నారు. మీడియా, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొంతమేర డబ్బులు రావొచ్చని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి ఏపీకి ఏమీ రావని… ఆశలు వదులుకోవాల్సిందే అని ఎంపీ జేసీ అన్నారు.