ఢిల్లీ : దేశ సేవ చేసేందుకే ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లిలో దీన్దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లో బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం జీవిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, అడ్వాణీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్గోయల్, సీనియర్ నేతలు పాల్గొన్నారు.