జమ్ముకశ్మీర్: సుంజ్వాన్ కాల్పుల ఘటనలో మరో ఉగ్రవాది హతమయ్యాడు. సుంజాన్ ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు దీటుగా భారత జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు. గత 51 గంటలుగా సైనిక కార్యాచరణ కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు సైనికులు, ఓ పౌరుడు మృతి చెందగా.. భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో ఆరుగురు సైనికులు, ఆరుగురు పౌరులకు గాయాలయ్యాయి.