ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచకప్ గెలిచే జట్టుకు భారీ ప్రైజ్ మనీ...

sports |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 03:31 PM

వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీంతో ఆ మెగా టోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ మెగా టోర్నీ జట్లను ప్రకటిస్తున్నాయి.  ప్రపంచకప్ కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ వాతావరణం మరింత వేడెక్కేలా.. విజేతలకు ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది.


ప్రపంచ కప్ విజేతలకు 1.6 మిలియన్ US డాలర్లు (13.05 కోట్లు) ప్రైజ్ మనీగా అందజేయబడుతుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ప్రైజ్‌మనీలో సగం లభిస్తుంది. సెమీ ఫైనల్స్‌లో ఓడిన వారికి 4 లక్షల అమెరికన్ డాలర్లు (3.26 కోట్లు) అందజేయనున్నారు. సూపర్ 12 స్టేజ్ నుంచి నిష్క్రమించిన వారికి 70 వేల అమెరికన్ డాలర్లు (57.07 లక్షలు) ఇస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com