తమిళనాడులోని నామక్కల్ జిల్లాకు చెందిన ధనపాల్కు, సంతియా (26)తో ఈ నెల 7న పెళ్లి జరిగింది. రెండు రోజులకే ఆమె ఎటో వెళ్లి పోయింది. ఆరుగురిని పెళ్లి చేసుకుని మోసగించిన నిత్య పెళ్లికూతురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె అప్పటికే 5 వివాహాలు చేసుకుందని తేలింది. సంతియాతో పాటు ఆమెకు సహకరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.