దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,777 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 23 మంది మరణించారు. 5196 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 43,994కు తగ్గిపోయింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.