బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపుల అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఏపీ ఎంపీలు భేటీ అయ్యారు. విభజన చట్టంలో పేర్కొని అమలు కాని అంశాలపై ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రకాశ్ జవదేకర్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు,తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, వరప్రసాద్, సీఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.