సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకుంది. తొలి వన్డే గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత్ జట్టు మార్పులేవి లేకుండా బరిలోకి దిగుతుంటే సౌతాఫ్రికా మాత్రం గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు మ్యాచ్ కు దూరమైయ్యారు. ఇప్పటికే చేతిగాయంతో డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరం కాగా, ఇప్పుడు డూప్లెసిస్ చేతివేలి గాయంతో సిరీస్ నుంచే తప్పుకున్నాడు. డూప్లెసిస్ స్థానంలో కెప్టెన్ గా మార్క్ రమ్ బాధ్యతలు స్వీకరించాడు.