న్యూఢిల్లి : జస్టిస్ లోయా మృతి కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనున్నది. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. షొరాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ విచారిస్తున్న జస్టిస్ లోయా 2014 డిసెంబర్ 1వ తేదీన తన సహచర న్యాయమూర్తి కుమార్తె వివాహానికి హాజరైన సమయంలో గుండెపోటుతో మరణించారు. జస్టిస్ లోయా మృతిపై అనేక అనుమానాలు రేకెత్తాయి. దీనిపై స్వతంత్ర దర్యాప్లు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.