అమరావతి : ప్రతి ఊరు పార్టీకి కంచుకోట కావాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై సానుకూలత ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామం అభివృద్ది చెందాలి. పార్టీ కూడా అభివృద్ది చెందాలన్నారు. నెలలో నాలుగైదు రోజులు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టాలన్నారు.