దావోస్: పాలన, పారిశ్రామికాభివృద్ధిలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దావోస్లో నూతన ప్రపంచీకరణలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతికత వేగంగా మారుతోంది… కాలానికి అనుగుణంగా మారాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా రూ.149కే టెలివిజన్, ఇంటర్నెట్, టెలీఫోన్ సేవలను అందిస్తున్నామన్నారు. గూగుల్ ఎక్స్ సహకారంతో మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. డేటా అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. మారుమూల పల్లెల్లో తయారు చేసే ఉత్పత్తులు విదేశాల్లో విక్రయించే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్ను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేయకుండానే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సెన్సార్లు, డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగాభివృద్ధిలో నవంబర్ వన్గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తయారీ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.