న్యూఢిల్లీ: ఇరవై మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై విధించిన అనర్హత వేటును రద్దు చేయాలంటూ ఆ ఎమ్మెల్యేలు కోర్టును వేడుకున్నారు. లాభదాయకమైన పదువులు కొనసాగుతున్న 20 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి కూడా వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నది.