రాజస్థాన్ : పద్మావత్ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ భిల్వారా పట్టణంలో ఒక యువకుడు 350 అడుగుల ఎత్తయిన టవర్పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తనతోపాటుగా పెట్రోల్ డబ్బాను తీసుకుని టవర్పైకి ఎక్కి ఆ వ్యక్తి పద్మావత్ చిత్రాన్ని నిషేధించాలంటూ పోస్టర్లు ప్రదర్శించాడు. పద్మావత్ చిత్రాన్ని నిషేధించినట్లు ప్రకటించిన తరువాతే టవర్పైనుంచి దిగి వస్తానని ఆ యువకుడు నినాదాలు చేశాడు.